వింజమూరులో నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగించకుండా బీఎల్ఏలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని పార్టీ సానుభూతిపరుల ఓట్లను కాపాడాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి బదులుగా అవినీతి, అప్పులకు ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు. ప్రజలు మళ్లీ వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సమాయత్తం కావాలని యువ నేత మేకపాటి అభినవ్ రెడ్డి కోరారు.

అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగించొద్దు.. బూత్ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి: మేకపాటి రాజగోపాల్ రెడ్డి
వింజమూరులో నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణా కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగించకుండా బీఎల్ఏలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని పార్టీ సానుభూతిపరుల ఓట్లను కాపాడాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి బదులుగా అవినీతి, అప్పులకు ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు. ప్రజలు మళ్లీ వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సమాయత్తం కావాలని యువ నేత మేకపాటి అభినవ్ రెడ్డి కోరారు.

