Tuesday, 8 September 2026
  • Home  
  • అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్‌ ఇవ్వాలి : గుత్తి నరసింహ విజ్ఞప్తి
- తిరుపతి

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్‌ ఇవ్వాలి : గుత్తి నరసింహ విజ్ఞప్తి

చిట్వేలు: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాజుగుంట మాజీ సర్పంచ్, టీడీపీ యువ నాయకుడు గుత్తి నరసింహ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితర అర్హులైన వారికి పింఛన్ అందేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం కల్పించిన గడువులోగా అర్హులైన వారు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్ పథకంపై అవగాహన కల్పించి, అర్హులు దరఖాస్తు చేసుకునేలా సచివాలయ సిబ్బంది సహకరించాలని కోరారు. దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించి, అర్హులైన ఒక్కరూ అవకాశాన్ని కోల్పోకుండా చూడాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా మండల అధికారులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్త పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో త్వరితగతిన నమోదు చేసి, తదుపరి పరిశీలన ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. అర్హత కలిగిన లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ శ్రీనివాసులు, డిప్యూటీ ఎండీఓ అనిల్, జనసేన నాయకుడు మాదాసు నరసింహ, టీడీపీ నాయకులు శివప్రసాద్ రాజు, బొంతల శివ నాగేశ్వరరావు, మహేష్‌రెడ్డి, ఆదినారాయణ, యానాది రాజు తదితర ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

చిట్వేలు: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాజుగుంట మాజీ సర్పంచ్, టీడీపీ యువ నాయకుడు గుత్తి నరసింహ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితర అర్హులైన వారికి పింఛన్ అందేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం కల్పించిన గడువులోగా అర్హులైన వారు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్ పథకంపై అవగాహన కల్పించి, అర్హులు దరఖాస్తు చేసుకునేలా సచివాలయ సిబ్బంది సహకరించాలని కోరారు. దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించి, అర్హులైన ఒక్కరూ అవకాశాన్ని కోల్పోకుండా చూడాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా మండల అధికారులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్త పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో త్వరితగతిన నమోదు చేసి, తదుపరి పరిశీలన ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. అర్హత కలిగిన లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ శ్రీనివాసులు, డిప్యూటీ ఎండీఓ అనిల్, జనసేన నాయకుడు మాదాసు నరసింహ, టీడీపీ నాయకులు శివప్రసాద్ రాజు, బొంతల శివ నాగేశ్వరరావు, మహేష్‌రెడ్డి, ఆదినారాయణ, యానాది రాజు తదితర ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.