అరకులోయ మండలం బోండం పంచాయతీలో సబ్-డీఎల్సీ ఆమోదం పొందిన 64 మంది ఆదివాసీ రైతులకు తక్షణమే కొండపోడు పట్టాలు పంపిణీ చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లో వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. సీపీఎం మండల నాయకుడు గత్తుం బుజ్జిబాబు మాట్లాడుతూ, 2024 నుంచి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, పట్టాలు లేక రైతులు సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని తెలిపారు. సకాలంలో డీఎల్సీ సమావేశాలు నిర్వహించి అర్హులైన రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా కొండపోడు రైతులతో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జి.కృష్ణారావు, జి.అప్పారావు, జి.జగత్రాయ్, జి.రంభ, బి.వీరస్వామి, పి.సుమిత్ర తదితరులు పాల్గొన్నారు.

అరకు: కొండపోడు పట్టాలు పంపిణీ చేయాలి
అరకులోయ మండలం బోండం పంచాయతీలో సబ్-డీఎల్సీ ఆమోదం పొందిన 64 మంది ఆదివాసీ రైతులకు తక్షణమే కొండపోడు పట్టాలు పంపిణీ చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లో వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. సీపీఎం మండల నాయకుడు గత్తుం బుజ్జిబాబు మాట్లాడుతూ, 2024 నుంచి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, పట్టాలు లేక రైతులు సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని తెలిపారు. సకాలంలో డీఎల్సీ సమావేశాలు నిర్వహించి అర్హులైన రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా కొండపోడు రైతులతో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జి.కృష్ణారావు, జి.అప్పారావు, జి.జగత్రాయ్, జి.రంభ, బి.వీరస్వామి, పి.సుమిత్ర తదితరులు పాల్గొన్నారు.

