నంద్యాల:స్థానిక అచీవర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యూక్లియస్ కాలేజ్ కరస్పాండెంట్ మురళీధర్ రెడ్డి, ప్రముఖ తెలుగు పండితులు సుబ్బన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు కేవలం పాఠాలు బోధించడమే కాకుండా విద్యార్థులకు క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పి సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని కొనియాడారు. విద్యార్థులు గురువులను గౌరవిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పాఠశాల కరస్పాండెంట్ వై. శ్రీనివాస్, డైరెక్టర్ ఈశ్వర్ చంద్ర, A.O. మానస, ప్రిన్సిపల్ ఎం.పీ. లావణ్యలు మాట్లాడుతూ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే మహత్తర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రసంగాలు ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో పాఠశాల ప్రెసిడెంట్ వరలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అచీవర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
నంద్యాల:స్థానిక అచీవర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యూక్లియస్ కాలేజ్ కరస్పాండెంట్ మురళీధర్ రెడ్డి, ప్రముఖ తెలుగు పండితులు సుబ్బన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు కేవలం పాఠాలు బోధించడమే కాకుండా విద్యార్థులకు క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పి సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని కొనియాడారు. విద్యార్థులు గురువులను గౌరవిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పాఠశాల కరస్పాండెంట్ వై. శ్రీనివాస్, డైరెక్టర్ ఈశ్వర్ చంద్ర, A.O. మానస, ప్రిన్సిపల్ ఎం.పీ. లావణ్యలు మాట్లాడుతూ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే మహత్తర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రసంగాలు ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో పాఠశాల ప్రెసిడెంట్ వరలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

