ఉత్తరప్రదేశ్లోని కౌశాంబీ జిల్లాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దళిత వర్గాలకు చెందిన గ్రామస్తులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్ఠించి, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సామాజిక సామరస్యాన్ని కాపాడాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అంబేద్కర్ విగ్రహం ధ్వంసం ఘటనపై ఉత్తరప్రదేశ్లో ఉద్రిక్తత
ఉత్తరప్రదేశ్లోని కౌశాంబీ జిల్లాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దళిత వర్గాలకు చెందిన గ్రామస్తులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్ఠించి, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సామాజిక సామరస్యాన్ని కాపాడాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

