తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ కు ఘన నివాళి
రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 10 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్ మండల కేంద్రంలో చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమాన్ని రజక సంఘం మండల అధ్యక్షులు సుద్దాల దేవయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహనీయురాలు, తెలంగాణ ఉద్యమ రథసారథి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చిట్యాల ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆమె సుదీర్ఘ పోరాటం విప్లవానికి నాంది పలికిందని, బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రజక కులాల రాష్ట్ర అధ్యక్షులు అక్క రాజు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ, CWFI–CITU రాష్ట్ర కమిటీ సభ్యులు గీస బిక్షపతి, ముస్తాబాద్ మండల అధ్యక్షులు గజ్జల రాజు, బీజేపీ మండల అధ్యక్షులు క్రాంతి, ఏళ్ల బాల్ రెడ్డి, మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, శీలం స్వామి, మనోహర్, దీటి బాలయ్య, సత్య, హనుమయ్య, భాను నరేష్, డిటి నరసింహులు, గీస శంకర్ తదితరులు పాల్గొన్నారు.


