కార్మిక హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు చేయాలి
ఎమ్మిగనూరు : కార్మిక హక్కుల పరిరక్షణకు కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రామకృష్ణ పిలుపునిచ్చారు. ఎమ్మిగనూరులో ఐఎఫ్టీయూ కర్నూలు జిల్లా 3వ మహాసభ సందర్భంగా జెండా ఆవిష్కరించారు.కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం కార్మికుల హక్కులపై దాడి అని రామకృష్ణ విమర్శించారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె. నాగరాజు మాట్లాడుతూ కార్మిక సమస్యల పరిష్కారానికి పోరాటాలను ఉధృతం చేయాలని కోరారు.


