జనగాం
సముద్రాలలో ముసురు వర్షం: మత్తడి దూకాలన్న రైతుల ఆశ
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామంలో నిన్న రాత్రి నుంచి ముసురు వర్షం కురుస్తోంది. ఈ వాన ప్రభావంతో చెరువులు నిండి మత్తడి దూకి, ఈ కాలం అంతా మంచిగా ఉండాలని రైతులు కోరుకుంటున్నారు. ఈ సీజన్లో వానలు లేక ఇబ్బంది పడ్డ అన్నదాతలకు ఈ వర్షం ఎంతో ఆశను ఇస్తోంది. భూములు తడిసి పంటలు కళకళలాడుతాయని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


