సముద్రాలలో అస్తవ్యస్తంగా మోరీలు.. ఇళ్లలోకి వెళ్లలేని దుస్థితి
జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామంలో వర్షాలు కురిస్తే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. మురుగు నీరు నిలవడంతో ఇళ్లలోకి వెళ్లేందుకు వీలులేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన, దోమలతో అనారోగ్యాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.


