కేసీఆర్పై కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపణ
అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్పై దాడికి కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, వేముల వీరేశంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల ప్రవర్తన అభ్యంతరకరమని ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, కోవా లక్ష్మి పేర్కొన్నారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.


