స్మార్ట్ సిటీకి ఇదేనా ‘రెవెన్యూ’ ముఖచిత్రం?
నెల్లూరును పరిశుభ్రమైన స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, నెల్లూరు రూరల్ MRO కార్యాలయ పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. నిత్యం వందలాది మంది వివిధ పనుల కోసం వచ్చే కార్యాలయ ప్రాంగణం ఎండిన ఆకులు, ప్లాస్టిక్, కాగితాలు తదితర చెత్తాచెదారంతో నిండిపోయింది. కార్యాలయాన్ని గుర్తించే సూచిక బోర్డు సైతం పాడై ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వ కార్యాలయమే అపరిశుభ్రంగా ఉంటే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెత్తను తొలగించి, బోర్డును మరమ్మతు చేయడంతోపాటు కార్యాలయ ప్రాంగణాన్ని నిరంతరం పరిశుభ్రంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.


