సంక్షేమ పథకాలు అందించడంతోనే ఆగిపోకుండా పేదలు ఆర్థికంగా సాధికారత సాధించే వరకు ప్రభుత్వం అండగా ఉండాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. 8వ కలెక్టర్ల కాన్ఫరెన్సులో సూపర్ సిక్స్, సంక్షేమ పథకాల అమలును సమీక్షించారు. కొత్త పెన్షన్లకు ముందే ఫ్యామిలీ యూనిట్ మ్యాపింగ్ చేపట్టాలని, పెద్ద కుటుంబాలకు అధిక ప్రయోజనాలు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కుటుంబ సభ్యులందరికీ తలో 5 కిలోల రేషన్ బియ్యం అందాలని స్పష్టం చేశారు. సంక్షేమానికి రూ.1.50 లక్షల కోట్లు, పెన్షన్లకే రూ.75 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, P4 అమలు, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

సంక్షేమం నుంచి సాధికారతే లక్ష్యం: సీఎం చంద్రబాబు
సంక్షేమ పథకాలు అందించడంతోనే ఆగిపోకుండా పేదలు ఆర్థికంగా సాధికారత సాధించే వరకు ప్రభుత్వం అండగా ఉండాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. 8వ కలెక్టర్ల కాన్ఫరెన్సులో సూపర్ సిక్స్, సంక్షేమ పథకాల అమలును సమీక్షించారు. కొత్త పెన్షన్లకు ముందే ఫ్యామిలీ యూనిట్ మ్యాపింగ్ చేపట్టాలని, పెద్ద కుటుంబాలకు అధిక ప్రయోజనాలు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కుటుంబ సభ్యులందరికీ తలో 5 కిలోల రేషన్ బియ్యం అందాలని స్పష్టం చేశారు. సంక్షేమానికి రూ.1.50 లక్షల కోట్లు, పెన్షన్లకే రూ.75 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, P4 అమలు, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

