మోకిల ప్లాట్ల ఈ-వేలంపై ప్రీ-బిడ్ సమావేశం
HMDA ఆధ్వర్యంలో మోకిల లేఅవుట్లోని 35 నివాస ప్లాట్ల ఈ-వేలంపై బుధవారం ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించారు. సూపరింటెండింగ్ ఇంజనీర్ V.V.V.S. అప్పారావు, డిప్యూటీ కలెక్టర్ Y. సుదర్శన్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ A. రవీందర్ రెడ్డి, PRO K. శ్రీకాంత్ రెడ్డి, D. శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. MSTC, KPMG ప్రతినిధులు ఈ-వేలం విధానాన్ని వివరించారు. రిజిస్ట్రేషన్కు ఆగస్టు 31 చివరి తేదీ కాగా, సెప్టెంబర్ 2న ఈ-వేలం జరగనుంది. HMDA హెల్ప్లైన్: 7416835522.


