మాజీ ఓఎస్డీ సుమంత్పై హత్యాయత్నం కేసు
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్పై మేడిపల్లి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తనపై రాడ్లతో దాడి చేశారని గొంగడి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుమంత్తో పాటు మరో ఐదుగురిపై సెక్షన్ 109 కింద కేసు నమోదైంది. ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో మేడిపల్లి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును జూబ్లీహిల్స్ పీఎస్కు బదిలీ చేశారు.


