టి.ఎన్.యు.ఎస్ నెల్లూరు జిల్లా నూతన కమిటీ ఎన్నిక
నెల్లూరు నగరంలో ఆదివారం జరిగిన టి.ఎన్.యు.ఎస్ కార్యవర్గ సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా చెవుల రామచంద్ర యాదవ్, ప్రధాన కార్యదర్శిగా గంగవరపు శ్రీనివాసులు ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ శెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. ముఖ్య అతిథి కేపీ చౌదరి మాట్లాడుతూ విద్యారంగంలో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులను వివరించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేస్తామని రామచంద్ర యాదవ్ తెలిపారు. గౌరవ అధ్యక్షుడిగా వి.పద్మయ్య, కోశాధికారిగా సీహెచ్ నాగరాజు సహా పలువురు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని నాయకులు అభినందించి సన్మానించారు.


