Tuesday, 15 September 2026

Tag: Devotional

నారాయణపేట

కున్సీ గ్రామంలో వినూత్నంగా వినాయక శోభాయాత్ర ఎద్దుల బండిపై విఘ్నేశ్వరుడి ఊరేగింపు – ఆకట్టుకున్న సంప్రదాయ వైభవం

కున్సీ గ్రామంలోని వినాయక నగర్ విఘ్నేశ్వర కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా వినూత్నంగా వినాయక శోభాయాత్ర నిర్వహించారు. మన పల్లె సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఎద్దుల బండిని ప్రత్యేకంగా అలంకరించి, అందులో విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గ్రామ పురవీధుల గుండా భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. భజనలు, కీర్తనల నడుమ సాగిన శోభాయాత్రలో చిన్నారులు, యువత, మహిళలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని “గణపతి బప్పా మోరియా” అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఎద్దుల బండిపై విఘ్నేశ్వరుడి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆధునికత వైపు పరుగులు తీస్తున్న నేటి రోజుల్లో పూర్వీకుల పల్లె సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసేలా నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామస్థులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తి, సంప్రదాయం, ఐక్యతను చాటుతూ సాగిన ఈ వినూత్న శోభాయాత్ర కున్సీ గ్రామ వినాయక చవితి వేడుకలకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో కున్సీ గ్రామం సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని భక్తులు ఆకాంక్షించారు

అన్నమయ్య

50 మంది స్వాములకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం

నందలూరు: హైదరాబాద్‌ నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం 22వ మహా పాదయాత్రగా బయలుదేరిన సుమారు 50 మంది స్వాములకు నందలూరుకు చెందిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం అల్పాహారం ఏర్పాటు చేశారు. పాదయాత్రలో పాల్గొంటున్న స్వాములకు అల్పాహారం అందించి, వారి యాత్ర విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. భక్తులకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామాక్షి, నాగరాజు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రికులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలిపారు. Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.