మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతం.. కమిషనర్లకు కీలక బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితాలను సెప్టెంబర్ 3, 2026న ప్రచురించనున్నారు. జనవరి 1, 2026 అర్హత తేదీగా తీసుకుని తాజా అసెంబ్లీ ఓటర్ల జాబితాల ఆధారంగా వీటిని రూపొందిస్తారు. మున్సిపల్ కమిషనర్లు జాబితాల తయారీ, ప్రచురణ బాధ్యతలు నిర్వర్తిస్తారు. జీవీఎంసీలో జోనల్ కమిషనర్లు ఈ ప్రక్రియ చేపడతారు.


