Tuesday, 2 June 2026

Tag: మామిడి పండ్లు

News ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం

పింఛ‌నుతో పాటు మామిడిపండ్ల‌ను అంద‌జేసిన‌ జిల్లా క‌లెక్ట‌ర్*

విశాఖ‌ప‌ట్ట‌ణం, జూన్ 01 ః రాష్ట్ర ప్ర‌భుత్వ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న ఎన్టీఆర్ భ‌రోసా సామాజిక పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎం. అభిషిక్త్ కిశోర్ భాగ‌స్వామ్య‌మ‌య్యారు. సోమ‌వారం ఉద‌యం జ్ఞానాపురం వ‌ద్ద‌ ప‌లువురు వృద్ధుల‌కు, విక‌లాంగుల‌కు, వితంతువుల‌కు స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారుల‌తో క‌లిసి పింఛ‌న్ల మొత్తాన్ని అంద‌జేశారు. అలాగే జ్ఞానాపురంలో ఓ వితంతు మ‌హిళ‌కు రూ.4,000 పింఛ‌ను సొమ్ముతో పాటు మామిడి పండ్ల‌ను కూడా క‌లెక్ట‌ర్ అందించారు. దీనిపై ఆమె హ‌ర్షం వ్య‌క్తం చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పింఛ‌న్ల పంపిణీ క్ర‌తువు గురించి అడిగి తెలుసుకున్న ఆయ‌న‌ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్ర‌క్రియ‌ను స‌జావుగా నిర్వ‌హించాల‌ని ఈ సంద‌ర్భంగా డీఆర్డీఏ, యూసీడీ పీడీల‌ను ఆదేశించారు. జ్ఞానాపురం వ‌ద్ద జ‌రిగిన కార్య‌క్రమంలో డీఆర్డీఏ పీడీ ల‌క్ష్మీప‌తి, జీవీఎంసీ సీఎంవో న‌రేశ్ కుమార్, జడ్సీ మ‌ల్ల‌య్య‌నాయుడు, స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు, స‌చివాల‌య ఉద్యోగులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.