కేసీఆర్ నివాస ముట్టడిపై ఆగ్రహం :ఎర్రోళ్ల శ్రీనివాస్
మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. శాసనసభ సమావేశాల్లో ఉండాల్సిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ నివాసం పరిసరాలకు ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రతిపక్ష నేత ఇంటి ముట్టడికి కుట్ర పన్నడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. భువనగిరి నుంచి దళితులను వాహనాల్లో తరలించారని ఆరోపించారు. కేసీఆర్ నివాసంపై దాడికి పోలీసులకు ఎవరు ఆదేశాలిచ్చారో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు.


