Wednesday, 9 September 2026

Tag: హైదరాబాద్

రంగారెడ్డి

ఎమ్మెల్సీ కోదండరాంకు బస్తీ దవాఖాన సపోర్టింగ్ స్టాఫ్ జన్మదిన శుభాకాంక్షలు

పున్నమి: హైదరాబాద్, సెప్టెంబర్ 5: తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం జన్మదిన వేడుకలు తార్నాకలోని ఆయన స్వగృహంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి కార్మిక విభాగం అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, తెలంగాణ బస్తీ దవాఖాన కాంట్రాక్ట్ & ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు మంగళిపాటి సుమన్, ప్రధాన కార్యదర్శి అంజద్ అలీ ఖాన్, కన్వీనర్, తెలంగాణ ఉద్యమకారుడు మెతుకు ఉప్పలయ్య, సంయుక్త కార్యదర్శి రౌతు నరసింహ, సభ్యులు గౌలికార్ మహేష్ కుమార్, వేముల అఖిల్ తదితరులు కోదండరాంను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కోదండరాంను శాలువాతో సత్కరించి, ఆయనకు ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత విజయాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బస్తీ దవాఖాన కాంట్రాక్ట్ & ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ప్రతినిధులు, తెలంగాణ జన సమితి కార్మిక విభాగం నాయకులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

న్యాయవాద కమిషనర్లకు ఆచరణాత్మక మార్గదర్శిని… యువ న్యాయవాదులకు పుస్తకం ఎంతో ఉపయోగకరం: హైకోర్టు న్యాయమూర్తులు

పున్నమి: రంగారెడ్డి జిల్లా: న్యాయవాది జి. అనిల్ కిరణ్ కుమార్ రచించిన “న్యాయవాద కమిషనర్లకు ఆచరణాత్మక మార్గదర్శిని” పుస్తక ఆవిష్కరణ సభ హైదరాబాద్ కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో ఘనంగా జరిగింది. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తులు వాకిటి రామకృష్ణారెడ్డి, జి.ఎం. మొహియుద్దీన్, మద్రాసు ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తి కె. సురేందర్, కె. లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాజీ అదనపు డీజీపీ, మాజీ సీబీఐ సంయుక్త సంచాలకులు వి. లక్ష్మీనారాయణ, తెలంగాణ న్యాయవాద మండలి అధ్యక్షులు ఎ. నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ, న్యాయవాద కమిషనర్ల పాత్ర న్యాయవ్యవస్థలో అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. న్యాయవాద కమిషనర్ల విధులు, బాధ్యతలు, ఆచరణాత్మక అంశాలను సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించే ఈ పుస్తకం ముఖ్యంగా యువ న్యాయవాదులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో న్యాయపరమైన అంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా పుస్తకాన్ని రూపొందించడం అభినందనీయమని పేర్కొంటూ రచయిత జి. అనిల్ కిరణ్ కుమార్‌ను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, న్యాయశాఖ ప్రముఖులు, న్యాయవాద కమిషనర్లు, న్యాయ రంగానికి చెందిన ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కో-కన్వీనర్‌గా పడాల సౌజన్య లత నియామకం

పున్నమి: రంగారెడ్డి జిల్లా: బ్రహ్మాండ్ సనాతన సంఘ్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కో-కన్వీనర్‌గా పడాల సౌజన్య లత నియమితులయ్యారు. బుధవారం రోజున బ్రహ్మాండ్ సనాతన సంఘ్ కేంద్ర కార్యాలయంలో సంఘం అధ్యక్షులు శివ చేతుల మీదుగా పడాల సౌజన్య లత నియామక పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పడాల సౌజన్య లత మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని గౌరవిస్తూ వాటి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి భక్తి కార్యక్రమాలను నిర్వహించి, ప్రతి ఒక్కరికీ హిందూ మతం, సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమాలు చేపడతానన్నారు. అలాగే నోములు, వ్రతాలు, హోమాలు, యజ్ఞయాగాదులు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను భాగస్వాములను చేస్తామని పేర్కొన్నారు. బ్రహ్మాండ్ సనాతన సంఘ్ అధ్యక్షులు శివ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో, ఐకమత్యంతో కలిసి జీవించాలని అన్నారు. హిందూ మతం, సనాతన ధర్మంలో జీవన క్రమశిక్షణతో పాటు గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయని తెలిపారు. కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా బ్రహ్మాండ్ సనాతన సంఘ్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని, ప్రతి ఒక్కరినీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, యువత ముందుకు వచ్చి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని శివ అన్నారు.

రంగారెడ్డి

మూసారాంబాగ్ హైలెవ‌ల్ బ్రిడ్జిని ప్రారంభించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

52 కోట్ల వ్య‌యంతో 400 మీట‌ర్ల పొడ‌వైన బ్రిడ్జి నిర్మాణం.. మూసీలో ల‌క్షా యాభై వేల క్యూసెక్కుల వ‌రద వ‌చ్చినా ఇబ్బంది త‌లెత్త‌కుండా బ్రిడ్జి నిర్మాణం. మెరుగు కానున్న అంబ‌ర్ పేట‌, మూసారాంబాగ్ కనెక్టివిటీ.. కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వి హ‌నుమంత‌రావు,ఎంపీ లు అసదుద్దీన్ ఒవైసీ,అనిల్ కుమార్ యాదవ్,అంబ‌ర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంక‌టేష్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గ‌ణేష్ , జూబ్లీహిల్స్ ఎంఎల్ ఏ నవీన్ యాదవ్ , ఎంఎల్ ఏ మల్ రెడ్డి రంగా రెడ్డి,మాజీ ఎంపీ మధు యాష్కీ,ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

క్రీడా స్ఫూర్తితో కళకళలాడిన పల్లవి ఇంజినీరింగ్ కళాశాల, మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

పున్నమి: రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, కుంట్లూర్‌లోని పల్లవి ఇంజినీరింగ్ కళాశాలలో భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావనను పెంపొందించే లక్ష్యంతో వివిధ ఇండోర్, అవుట్‌డోర్ క్రీడా పోటీలను నిర్వహించారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్, ఎమ్మెల్సీ శ్రీ మల్క కొమరయ్య వర్చువల్‌గా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. మల్క నవీన్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి విద్యతో పాటు క్రీడలు, సాంకేతిక, సాంస్కృతిక, సహపాఠ్య కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. అకాడమిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ ఎస్.జి.ఎస్. మూర్తి క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వం, ఏకాగ్రత, సమయపాలన పెంపొందుతాయని తెలిపారు. మేనేజ్‌మెంట్ రిప్రజెంటేటివ్ శ్రీ బెరెల్లి కమలాకర్ రావు, ప్రిన్సిపాల్ డా. జె.బి.వి. సుబ్రహ్మణ్యం, వైస్ ప్రిన్సిపాల్ డా. ఆర్. ప్రశాంత్ కుమార్ విద్యార్థులను అభినందించారు. కార్యక్రమాల సమన్వయంలో ధనుంజయ రావు కొడాలి, శ్రీ ఎ. సంతోష్, గురునాథం, సి.హెచ్. రంజిత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

రంగారెడ్డి

ప‌ర్యావ‌ర‌ణ హితంగా వేడుకలు జ‌ర‌గాలి. గ‌ణేష్ ఉత్స‌వాల‌తోనే ప్రారంభ‌మ‌వ్వాల‌న్న‌ హైడ్రా క‌మిష‌న‌ర్‌

పున్నమి: హైద‌రాబాద్‌, వేడుక ఏదైనా ప‌ర్యావ‌ర‌ణ హితంగా ఉండాలి. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ అంద‌రి బాధ్య‌త‌గా మారాలి. గ‌ణేష్ ఉత్స‌వాలతోనే ఇది ప్రారంభం కావాలి.. స్వాతంత్ర సంగ్రామానికే గ‌ణేష్ ఉత్స‌వం ఊత‌మిచ్చింది. ఇప్పుడు ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు కూడా తోడ్ప‌డాలి. న‌గ‌రంలో చెరువుల‌న్నీ కాలుష్య ర‌హితంగా మారాలి. ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి చెరువుల‌ను హైడ్రా విస్త‌రిస్తోంది. మురికి కూపాలుగా ఉన్న చెరువుల‌లో పూడిక‌ను మొత్తం తొల‌గించి మంచి నీటి స‌ర‌స్సులుగా మార్చేందుకు హైడ్రా గ‌ట్టి ప్ర‌య‌త్నం చేస్తోంది. మురుగు నీరు క‌ల‌వ‌కుండా ప్ర‌తి చెరువు వ‌ద్ద ఎస్‌టీపీ(సీవ‌రేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌)ల‌ను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ క్ర‌మంలో చెరువులు కాలుష్యం కాకుండా చూడాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంది. గ‌ణేష్ ఉత్స‌వాల‌ను దృష్టిలో పెట్టుకునే ప్ర‌తి చెరువు వ‌ద్ద బేబీ పాండ్‌ల‌ను నిర్మిస్తున్నాం. ఇలాంటి త‌రుణంలో న‌గ‌ర ప్ర‌జ‌లు కూడా ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన మట్టి గ‌ణేష్ విగ్ర‌హాల‌కే ప్రాధాన్యం ఇవ్వాలి“ అని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ దిశ‌గా ఇప్ప‌టికే చాలా మార్పు వ‌చ్చి ఇళ్ల‌ల్లో పెట్టే చిన్న విగ్ర‌హాల‌ను మ‌ట్టితో రూపొందిస్తున్నారు. ఉత్స‌వ ఊరేగింపున‌కు అనుగుణంగా పెద్ద విగ్ర‌హాలు కూడా మ‌ట్టితో త‌యార‌య్యేలా నిర్వాహ‌కులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఇందుకు సాంకేతిక‌ను అంది పుచ్చుకోవాల‌ని.. ఆ దిశ‌గా నిపుణులు ఆలోచించాల‌ని కోరారు. ఈ విష‌యంలో స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌తో క‌ల‌సి ప‌ని చేసేందుకు హైడ్రా సిద్ధంగా ఉంద‌న్నారు. ప‌ర్యావ‌ర‌ణ‌ హిత‌మైన న‌గ‌ర నిర్మాణంలో ప్ర‌భుత్వం చూపుతున్న చొర‌వే హైడ్రా ఏర్పాట‌ని.. ఆ క్ర‌మంలోనే మ‌ట్టి విగ్ర‌హాల‌పై కూడా అంద‌రూ దృష్టి సారించాల‌ని న‌గ‌రంలోని ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌లు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ క‌లిసి విజ్ఞ‌ప్తి చేశాయి. ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్‌తో క‌లిగే న‌ష్టాల‌ను.. మ‌ట్టి విగ్ర‌హాల‌తో క‌లిగే లాభాల‌ను వివ‌రిస్తూ రూపొందించిన పోస్ట‌ర్‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ చేతుల మీదుగా ఆవిష్క‌రింప‌జేశారు. ఒక్క రూపాయికే మ‌ట్టి విగ్ర‌హాల‌ను అందిస్తున్నామ‌ని ఈ సంద‌ర్భంగా లైఫ్ సేవ‌ర్స్ ఆర్గ‌నైజేష‌న్ ప్ర‌తినిధి శివ నేత తెలిపారు. హైడ్రా అభివృద్ధి చేస్తున్న చెరువులు ఎంతో ప‌ర్యావ‌ర‌ణ హితంగా మారుతున్నాయ‌ని.. వాటికి మ‌న ఉత్స‌వాలు కూడా తోడ‌వ్వాల‌ని.. అంద‌రూ మ‌ట్టి విగ్ర‌హాల‌కు జై కొట్టాల‌ని సుర‌క్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోపి శంక‌ర్ యాదవ్ ఆకాంక్షించారు. స‌ర్వాయి పాప‌న్న చారిట‌బుల్ ట్ర‌స్ట్‌,BASS GROUP ఇమ్మడి విజయభాస్కర్, అమ్మా ఫౌండేష‌న్‌, అనుశ్రీ చారిట‌బుల్ ట్ర‌స్ట్‌, వారాహి ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు శ్రీ‌నివాస్‌, అనిల్‌కుమార్‌, అను పులెపాక‌ తదితరులు హైడ్రా క‌మిష‌న‌ర్‌ను క‌లిసిన వారిలో ఉన్నారు. హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ వ‌ర్ల పాప‌య్య‌, అద‌న‌పు క‌మిష‌న‌ర్లు ఆర్ సుద‌ర్శ‌న్. ఆనంద్ కుమార్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

నిజామాబాద్

*హైదరాబాద్: లంచం తీసుకుంటూ పట్టుబడిన చందానగర్ ఎస్సై బాలరాజు, కానిస్టేబుళ్లు*

భూవివాదం కేసులో రూ.75 వేలు లంచం డిమాండ్ చేసిన హైదరాబాద్ చందానగర్ ఎస్ఐ బాలరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. లంచం తీసుకుంటుండగా ఎస్ఐతోపాటు కానిస్టేబుల్ రాజ్కుమార్, స్టేషన్ రైటర్ రాఘవను రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎస్ఐని పోలీస్టేషన్లో ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఏసీబీ అధికారుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.