డీఎస్సీ దుమారం.. బాబు–లోకేష్లపై కాకాణి గురి
డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని, వాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యులని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా నిబంధనల సవరణ, తప్పుడు సర్టిఫికెట్లు, పారదర్శకత లోపంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లోకేష్ రాజీనామా చేయడంతోపాటు మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఆధారాలు బయటపడ్డాక విచారణ ప్రకటించడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. అధికారుల మీడియా వివరణలే అక్రమాలను ధ్రువీకరించాయని ఆయన పేర్కొన్నారు.


