Thursday, 10 September 2026

Tag: #డీఎస్సీ2025 #కాకాణిగోవర్ధన్‌రెడ్డి #చంద్రబాబునాయుడు #నారాలోకేష్ #సీబీఐవిచారణ #నిరుద్యోగులు #నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డీఎస్సీ దుమారం.. బాబు–లోకేష్‌లపై కాకాణి గురి

డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని, వాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ బాధ్యులని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. స్పోర్ట్స్‌ కోటా నిబంధనల సవరణ, తప్పుడు సర్టిఫికెట్లు, పారదర్శకత లోపంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. లోకేష్‌ రాజీనామా చేయడంతోపాటు మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఆధారాలు బయటపడ్డాక విచారణ ప్రకటించడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. అధికారుల మీడియా వివరణలే అక్రమాలను ధ్రువీకరించాయని ఆయన పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.