గిరిజన కాలనీలో వడదెబ్బకు గురికాకుండా హోమియో కిట్స్ పంపిణీ.
పున్నమి న్యూస్ డి హరికృష్ణ జులై 15 విద్యానగర్ కోట మండలం,
కోట మండలం విద్యానగర్ గ్రామంలో గత రెండు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయి ప్రజలు ఉక్కుపోతకు గురిగా పోతున్న దృశ్యం వాటినే కొంతమేర అరికట్టే నిమిత్తం విద్య ప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ఆదిలక్ష్మి గార్ల జ్ఞాపకార్థం ఏర్పాటైన ఎం వి రావు ఫౌండేషన్ గిరిజన కాలనీలోనే ప్రజలకు హోమియో కిట్స్ పంపిణీ చేసింది.
ప్రతి కుటుంబానికి ఒక్కొక్క కిట్టు వంతున అందించిన ఈ హోమియో మందులను ప్రత్యేక కుటుంబం వారు వారం చొప్పున ఈ మందులను సద్వినియోగం చేసుకోవచ్చని ఎం.వి. రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు.
ఈ హోమియో కిట్స్ లో వడదెబ్బ సోకకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ మందులను ప్రతి ఒక్కరూ వినియోగిస్తే వేసవి తాపం నుంచి కొంత ఉపశమనం పొందవచ్చునే లీలా మోహన్ కృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి గిరిజన కాలనీవాసులు పాల్గొన్నారు.



