దుత్తలూరు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు సంస్థాగతంగా మరింత పటిష్ఠం కావాలని, రానున్న స్థానిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం సీఎం సహాయనిధి ద్వారా దుత్తలూరు మండలానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.5,54,491 విలువైన ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దుత్తలూరులో ఘనంగా టీడీపీ నూతన కార్యాలయ ప్రారంభం.. రూ.5.54 లక్షల సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
దుత్తలూరు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు సంస్థాగతంగా మరింత పటిష్ఠం కావాలని, రానున్న స్థానిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం సీఎం సహాయనిధి ద్వారా దుత్తలూరు మండలానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.5,54,491 విలువైన ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

