Sunday, 12 July 2026

Blog

ఖమ్మం

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఖమ్మం పర్యటన విజయవంతం

పువ్వాడ నాగేంద్ర కుమార్ (ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్) భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా మొట్టమొదటి సారి ఖమ్మం విచ్చేసిన రామచందర్ రావు కి ఖమ్మం బిజెపి శ్రేణులు ఖమ్మం జిల్లా సరిహద్దు మామిళ్ల గూడెం టోల్ ప్లాజా నుండి ఘన స్వాగతం పలికి ర్యాలీ గా ఖమ్మం జిల్లా లోకి తొడ్కోని వచ్చారు. కూసుమంచి శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరంఖమ్మం నగరం కి వచ్చారు. ర్యాలీ గా స్థానిక జిల్లా పరిషత్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహం కి పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్థానిక బైపాస్ రోడ్డు నందు సప్త పడి ఫంక్షన్ హాల్ నందు జిల్లా స్థాయి కార్యకర్తల సమ్మేళనం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతు రైతులకి ఇచ్చిన హామీలని బేషరత్తు గా అమలు చెయ్యాలి అని డిమాండ్ చేసారు. రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ మాట్లాడుతూ బిజెపి కార్యకర్తలు పార్టీ సిద్దాంతం కోసం పని చేస్తారే తప్పు మరే ఇతర ప్రలోభాలకి తలోగ్గి పని చేసేవారు కాదన్నారు. పార్లమెంట్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా లో మునుపేన్నాడు లేని విధంగా బిజెపి అభ్యర్థి అయినా తనకు అధిక ఓట్లు వేశారు అని ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని అయన అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కి ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి మాత్రం శున్యం అని అన్నారు. ప్రజలు నమ్మి ఓటు వేస్తే ఆ ప్రజలనే మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో పాదయాత్ర చేయాల్సిన ప్రజా ప్రతినిధులు మొహం చాటస్తే ఇంచార్జ్ గా వచ్చిన మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తుందన్నారు ఎరువుల విషయం లో కేంద్రం తెలంగాణ ప్రభుత్వం ని ఇబ్బందులు పెడుతుంది అని తుమ్మల అంటూనరాని అందులో ఏ మాత్రం నిజం లేదన్నారు. తుమ్మల నాగేశ్వరావ్ చేసిన ఆరోపణ ని నిరూపించ లేకపోతే తుమ్మల నాగేశ్వ రావ్ రాజీ నామ చెయ్యాలి అని సవాల్ విసిరారు. ఎన్ని క ఏది అయినా విజయం బిజెపి దే అని, బి ఆర్ ఎస్ పని అయిపోయింది అని ప్రధాన పోటీ బిజెపి కాంగ్రెస్ మధ్య అని అయన అన్నారు. ఖమ్మం, నల్గొండ బ్యాచ్ కి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమం లో కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి, గల్లా సత్యనారాయణ,తాండ్రా వినోద్ రావు, దేవకీ వాసుదేవరావు, చావా కిరణ్, రవి రాదోడ్, నున్న రవికుమార్, గేంటెల విద్యాసాగర్,పెరుమాళ్ళ పల్లి విజయ్ రాజు, గోంగూర వెంకటేశ్వర్లు దొంగల సత్య నారాయణ, ఈవి రమేష్ నంబూరి రామలింగేశ్వరావ్ లు శ్రీమతి కొల్లిపక శ్రీదేవి పాల్గొన్నారు

ఖమ్మం

జై గల్లా అనే నినాదాల తో మార్మోగిన సమావేశం మందిరం

*జై గల్లా.. కొండ పల్లి శ్రీధర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి.. తాండ్ర వినోద్ రావు జిందాబాద్ అనే నినాదాలతో మర్మోగిన సమావేశ మందిరం* ఖమ్మం పున్నమి ప్రతినిధి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామ చంద్ర రావు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా మొట్ట మొదటి సారిగా ఖమ్మం వచ్చిన నేపథ్యంలో స్థానిక సప్త పది ఫంక్సన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనం లో గల్లా సత్య నారాయణ, తాండ్రా వినోద్ రావు, కొండ పల్లి శ్రీధర్ రెడ్డి అభిమానులు గల్లా సత్య నారాయణ నాయకత్వం వర్ధిల్లాలి తాండ్రా వినోద్ రావు నాయకత్వం వర్ధిల్లాలి అని, కొండ పల్లి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి అని వారి అభిమానలు నినాదాలు చేసారు.

E-పేపర్

వైసీపీ కార్యకర్తలను పరామర్శించిన శిల్పా

నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామ వైసిపి నాయకుడు పి చెన్నయ్యకు ల ఉదయానంద హాస్పటల్ నందు సర్జరీ జరిగిన విషయాన్ని గ్రామ వైసిపి నాయకులు తెలియజేయడంతో చిన్నయ్యను మాజీ ఎమ్మెల్యే శిల్పారవి చంద్ర కిషోర్ రెడ్డి పరామర్శించి ధైర్యంగా ఉండాలంటూ తెలియజేశారు త్వరలో కోలుకొని పార్టీ కార్యక్రమాలలో పాల్గొనాలని అన్నారు

ఖమ్మం

కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం లో పెనుబల్లి నాయకులు

పున్నమి ప్రతినిధి ఖమ్మం నగరం లో మంగళవారం నాడు జరిగిన బీజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామచంద్ర రావు యొక్క ఆత్మీయ సమ్మేళనం లో సత్తుపల్లి నియోజకవర్గం లో పెనుబల్లి నాయకులు పడిగలమధు, బొర్రా నరసింహ రావు, మహేష్, చెక్కిలాల మంగేశ్వరావ్ లు పాల్గొన్నారు

ఖమ్మం

కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం లో పెనుబల్లి నాయకులు

పున్నమి ప్రతినిధి ఖమ్మం నగరం లో మంగళవారం నాడు జరిగిన బీజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామచంద్ర రావు యొక్క ఆత్మీయ సమ్మేళనం లో సత్తుపల్లి నియోజకవర్గం లో పెనుబల్లి నాయకులు పడిగలమధు, బొర్రా నరసింహ రావు, మహేష్, చెక్కిలాల మంగేశ్వరావ్ లు పాల్గొన్నారు

అన్నమయ్య

బాణాసంచా చేతిలో పేలి తీవ్రంగా గాయపడ్డ పోలోపల్లి గ్రామానికి చెందిన కోటేశ్వరరావు అనే యువకుడు

చిట్వేలి(పున్నమి ప్రతినిధి) జూలై 29 అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం పోలోపల్లి గ్రామం కు చెందిన కోటేశ్వర రావు అనే యువకునికి చేతిలో బాణాసంచ పేలి తీవ్రంగా గాయాలయ్యాయి. స్నేహితుని బర్త్డే సెలబ్రేషన్స్ సందర్భంగా కోటేశ్వర రావు తప్పతాగి నాటు రాకెట్ చేతితో పట్టుకొని వెలిగించగా, చేతిలో పేలి తీవ్ర గాయాలయ్యాయి. హుటా హుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. కంటికి, చేతులకు తీవ్ర గాయాలు కాగా, పరిస్థితి విషమంగా ఉండడంతో 108 లో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చిట్వేల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిర్మల్

రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

పున్నమి ప్రతినిధి నిర్మల్: సారంగాపూర్ మండల కేంద్రంలో మండలానికి చెందిన 2118 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఇది శుభ పరిణామం అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం గత 5 సంవత్సరాలుగా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుందని తెలిపారు. రేషన్ కార్డు లేని కారణంగా సంక్షేమ పథకాలకు అనర్హులుగా ప్రకటించారని, ప్రస్తుతం అర్హులైన పేద ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలని సూచించారు. ఇంకా రేషన్ కార్డులు లేని ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ గారు, జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి గారు, నాయకులు రావుల రాంనాథ్, ఆర్డీవో రత్నా కళ్యాణి గారు, ఎమ్మార్వో, ఎంపీడీవో,మండల అధ్యక్షులు, మండల నాయకులు, కారకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

బోటిమీద పల్లి పంచాయతీ వాస్తవ్యులు అన్నంగి రామలక్ష్మమ్మ గారికి ₹71,664 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ , మరియు ముక్కా వరలక్ష్మి

ఓబులువారిపల్లి, (పున్నమి ప్రతినిధి)జులై 28 ఓబులువారిపల్లి మండలం కాకర్ల వారిపల్లి గ్రామానికి చెందిన అన్నంగి రామలక్ష్మమ్మ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ₹71,664 విలువైన చెక్ ను బాధితుడి ఇంటికి వెళ్లి స్వయంగా వెళ్లి *ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి అందించారు. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ మాట్లాడుతూప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా ఉండేలా నేను కృషి చేస్తున్నాను.ఈ చెక్కులు ఆ కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని వారికి ఆసరాగా నిలుస్తాయి “ అని అన్నారు.ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ”సమాజంలో వైద్యం వసతి లేక బడుగు బలహీన వర్గానికి చెందిన ప్రజలు ఇబ్బంది పడకూడదన్న దృక్కోణంతో ప్రభుత్వ సహాయం అందిస్తోంది.అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సహాయం అందేలా మేము కృషి చేస్తాం.” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

అన్నమయ్య

కాకర్ల వారిపల్లి గ్రామ వాస్తవ్వులు పొలిన సుబ్బారాయుడు ₹84,928 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు ముక్కా వరలక్ష్మి

ఓబులువారిపల్లి (పున్నమి ప్రతినిధి) జూలై 28 ఓబులువారిపల్లి మండలం బొటిమీడిపల్లి పంచాయతీ కాకర్ల వారిపల్లి గ్రామానికి చెందిన పొలిన సుబ్బారాయుడు కి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ₹84,928 విలువైన చెక్ ను బాధితుడి ఇంటికి వెళ్లి స్వయంగా ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ మరియు టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి వెళ్లి అందించారు.ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ:”ప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా ఉండేలా నేను కృషి చేస్తున్నాను.ఈ చెక్కులు ఆ కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని వారికి ఆసరాగా నిలుస్తాయి “ అని అన్నారు.ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ”సమాజంలో వైద్యం వసతి లేక బడుగు బలహీన వర్గానికి చెందిన ప్రజలు ఇబ్బంది పడకూడదన్న దృక్కోణంతో ప్రభుత్వ సహాయం అందిస్తోంది.అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సహాయం అందేలా మేము కృషి చేస్తాం.” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

ఖమ్మం

ఘనంగా డాక్టర్స్ మెడికల్ అకాడమీ సక్సెస్. మీట్

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్) ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం నగరం లోని ప్రముఖ విద్యాసంస్థ డాక్టర్స్ మెడికల్ అకాడమీ సక్సెస్ మీట్ సోమవారం స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగినది ఈ మీట్ కి ముఖ్య అతిథిగా యువ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ పాల్గొని మెడికల్ సీటు సాధించిన విద్యార్ధులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమం లో డాక్టర్స్ మెడికల్ అకాడమీ యాజమాన్యం ఈగ భరణి, రాయల సతీష్, ఈగ లక్ష్మి, రాయల ఈశ్వరీ మరియు అకాడమీ సిబ్బంది విద్యార్థిని, విద్యార్దూ లు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.