పున్నమి న్యూస్ ప్రతినిధి:
వేముల, సెప్టెంబర్ 16:
ఎన్నికల కమిషన్ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు రాబోయే MPTC/ZPTC ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా పోలింగ్ కేంద్రాల (Draft Polling Stations) ఏర్పాటుపై వేముల మండల ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఎంపీడీఓ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముసాయిదా పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు, పోలింగ్ కేంద్రాల స్థానాలు, ఓటర్లకు కల్పించాల్సిన సౌకర్యాలు, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ తదితర అంశాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.
ముసాయిదా పోలింగ్ కేంద్రాలపై అభిప్రాయాలు, సూచనలు లేదా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా సమర్పించాలని అధికారులు సూచించారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులు ముసాయిదా పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలను పరిశీలించి, ఎటువంటి అభ్యంతరాలు లేవని ఏకగ్రీవంగా తెలిపారు.
దీంతో MPTC/ZPTC ముసాయిదా పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలపై రాజకీయ పార్టీల నుంచి ఎటువంటి అభ్యంతరాలు నమోదు కాలేదు.
సమావేశానికి హాజరైన రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులకు అధికారులు ధన్యవాదాలు తెలియజేసి సమావేశాన్ని ముగించారు.



