నంద్యాల: కొత్త పింఛన్ల దరఖాస్తులకు ప్రభుత్వం ఇచ్చిన సమయం చాలక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించాలని వైసీపీ నాయకుడు సన్నల సాయిరాం రెడ్డి డిమాండ్ చేశారు.వరుసగా వచ్చిన మూడు రోజుల ప్రభుత్వ సెలవులు, సర్వర్ సమస్యలు, ధ్రువపత్రాల సేకరణలో ఆలస్యం, సదరం సర్టిఫికేట్లలో తప్పులు, గృహ మ్యాపింగ్ సమస్యల వల్ల దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి గడువు పెంచి అర్హులందరికీ న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహ యువరాజ్, రఫీ తదితరులు పాల్గొన్నారు.

పింఛన్ దరఖాస్తుల గడువు నెలాఖరు వరకు పెంచాలి: వైసీపీ
నంద్యాల: కొత్త పింఛన్ల దరఖాస్తులకు ప్రభుత్వం ఇచ్చిన సమయం చాలక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించాలని వైసీపీ నాయకుడు సన్నల సాయిరాం రెడ్డి డిమాండ్ చేశారు.వరుసగా వచ్చిన మూడు రోజుల ప్రభుత్వ సెలవులు, సర్వర్ సమస్యలు, ధ్రువపత్రాల సేకరణలో ఆలస్యం, సదరం సర్టిఫికేట్లలో తప్పులు, గృహ మ్యాపింగ్ సమస్యల వల్ల దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి గడువు పెంచి అర్హులందరికీ న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహ యువరాజ్, రఫీ తదితరులు పాల్గొన్నారు.

