నర్సరావుపేట :జడ్పీటీసీల వారిగా ఓటర్ల జాబితా విడుదల చేసిన సీఈవో ,రాబోయే జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ(జడ్పీటీసీ) సాధారణ ఎన్నికల నిమిత్తం ఓటర్ల తుది జాబితాలను మండలాల వారీగా విడుదల చేశారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా జడ్పీ సీఈవో జ్యోతి బసు జిల్లా పరిధిలోని 28 జడ్పీటీసీల వారిగా ఓటర్ల జాబితాలను అధికారికంగా విడుదల చేశారు. మొత్తం 11,81,399 ఓట్లు కాగా పురుషులు 5,84,394. మహిళలు 5,96,937. ఇతరుల ఓట్లు 68 ఉన్నాయి. ఈ జాబితాల ఆధారంగా రాబోయే ఎన్నికలకు అవసరమైన పోలింగ్ ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేస్తున్నారు.



