సంగం మండలం శ్రీనివాసపురం గిరిజన కాలనీలో వినాయక చవితి సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.టీడీపీ యువ నాయకుడు కాకు మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో, నేతాజీ కళాశాల ప్రిన్సిపాల్ మదర్ బాషా సహకారంతో మహిళలకు చీరలు, స్వీట్లు, మిక్చర్ అందజేశారు.ప్రతి ఒక్కరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు కాకు మధుసూదన్ యాదవ్ తెలిపారు.
వినాయక చవితి ఐక్యతకు ప్రతీక అని, ప్రజలందరూ సోదరభావంతో, ఎటువంటి విద్వేషాలకు తావులేకుండా పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా సంగం మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో కంఠాబత్తిన రాజా, పిండిబోయిన పృద్వి యాదవ్, మోతుకూరి వినయ్ తదితరులు పాల్గొన్నారు.

వినాయక చవితి సందర్భంగా గిరిజన మహిళలకు చీరల పంపిణీ
సంగం మండలం శ్రీనివాసపురం గిరిజన కాలనీలో వినాయక చవితి సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.టీడీపీ యువ నాయకుడు కాకు మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో, నేతాజీ కళాశాల ప్రిన్సిపాల్ మదర్ బాషా సహకారంతో మహిళలకు చీరలు, స్వీట్లు, మిక్చర్ అందజేశారు.ప్రతి ఒక్కరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు కాకు మధుసూదన్ యాదవ్ తెలిపారు. వినాయక చవితి ఐక్యతకు ప్రతీక అని, ప్రజలందరూ సోదరభావంతో, ఎటువంటి విద్వేషాలకు తావులేకుండా పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా సంగం మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో కంఠాబత్తిన రాజా, పిండిబోయిన పృద్వి యాదవ్, మోతుకూరి వినయ్ తదితరులు పాల్గొన్నారు.

