పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించిన తలనీలాలు ద్వారా రూ. 16 కోట్ల 23 లక్షల ఆదాయం సమకూరింది. వేలంపాటలో కళావతి ఎంటర్ప్రైజెస్ రూ. 14 కోట్ల ఒక లక్షకు లైసెన్స్ దక్కించుకుంది కళ్యాణ కట్ట టికెట్ల ద్వారా రూ. రెండు కోట్ల 22 లక్షల ఆదాయం వచ్చింది. ఇందులో నాయి బ్రాహ్మణులకు 40% వాటా ఇవ్వనున్నారు



