నంద్యాల: జిల్లాలో కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకు ఇంటింటి కుష్టు వ్యాధి సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా కుష్టు నిర్మూలన అధికారి డా. ఎం. శారదా బాయి తెలిపారు. 2027 మార్చి నాటికి కుష్టు రహిత జిల్లాగా మార్చే లక్ష్యంతో ఆశా కార్యకర్తలు, పురుష వాలంటీర్లు ఇంటింటికీ వచ్చి వ్యాధి లక్షణాలను గుర్తిస్తారని చెప్పారు.చర్మంపై స్పర్శలేని మచ్చలు, అరచేతులు, అరికాళ్లలో స్పర్శ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా బహుళ ఔషధ చికిత్స (MDT) అందిస్తామని తెలిపారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని, బాధితుల పట్ల వివక్ష చూపకుండా సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.

కుష్టు సర్వేకు ప్రజలు సహకరించాలి: డీఎంహెచ్ఓ శారదా బాయి
నంద్యాల: జిల్లాలో కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకు ఇంటింటి కుష్టు వ్యాధి సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా కుష్టు నిర్మూలన అధికారి డా. ఎం. శారదా బాయి తెలిపారు. 2027 మార్చి నాటికి కుష్టు రహిత జిల్లాగా మార్చే లక్ష్యంతో ఆశా కార్యకర్తలు, పురుష వాలంటీర్లు ఇంటింటికీ వచ్చి వ్యాధి లక్షణాలను గుర్తిస్తారని చెప్పారు.చర్మంపై స్పర్శలేని మచ్చలు, అరచేతులు, అరికాళ్లలో స్పర్శ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా బహుళ ఔషధ చికిత్స (MDT) అందిస్తామని తెలిపారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని, బాధితుల పట్ల వివక్ష చూపకుండా సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.

