కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కరపలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో పౌష్టికాహార వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి హెల్త్ ప్రోగ్రాం ఆర్గనైజర్ జి చంద్రకళ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించే ఆకుకూరలు, కాయగూరలు,పండ్లు వినియోగించడం ద్వారా రోగాలకు దూరం కావచ్చును అన్నారు. ఈ సందర్భంగా ఆకుకూరలు,కాయగూరలు, పండ్ల ద్వారా లభించే పోషకాలను వివరించి వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు. ముందు జాగ్రత్తలు పాటించడం,సమతుల ఆహారాన్ని తీసుకోవడం, వండేటప్పుడు మార్పులు చేసుకోవడం తదితర విధానాలను పాటించడం ద్వారా ఆరోగ్యకర జీవనాన్ని కొనసాగించవచ్చునని బీమాబాయి మహిళా మండలి కమిటీ ఆర్గనైజర్ డి లోవ కుమారి అన్నారు. ఈ సందర్భంగా పౌష్టికాహార ప్రాముఖ్యతను తెలియజేస్తూ ర్యాలీని నిర్వహించి, నినాదాలు చేశారు.

బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో కరపలో పౌష్టికాహార వారోత్సవ కార్యక్రమాలు
కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కరపలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో పౌష్టికాహార వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి హెల్త్ ప్రోగ్రాం ఆర్గనైజర్ జి చంద్రకళ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించే ఆకుకూరలు, కాయగూరలు,పండ్లు వినియోగించడం ద్వారా రోగాలకు దూరం కావచ్చును అన్నారు. ఈ సందర్భంగా ఆకుకూరలు,కాయగూరలు, పండ్ల ద్వారా లభించే పోషకాలను వివరించి వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు. ముందు జాగ్రత్తలు పాటించడం,సమతుల ఆహారాన్ని తీసుకోవడం, వండేటప్పుడు మార్పులు చేసుకోవడం తదితర విధానాలను పాటించడం ద్వారా ఆరోగ్యకర జీవనాన్ని కొనసాగించవచ్చునని బీమాబాయి మహిళా మండలి కమిటీ ఆర్గనైజర్ డి లోవ కుమారి అన్నారు. ఈ సందర్భంగా పౌష్టికాహార ప్రాముఖ్యతను తెలియజేస్తూ ర్యాలీని నిర్వహించి, నినాదాలు చేశారు.

