బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. శాసనసభలో ముఖ్యమంత్రి వ్యవహారాలు బయటపడతాయనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 16 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం కోటి 16 లక్షల ఎకరాలను ఆ జాబితాలో చేర్చిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, అనుచరులకు విలువైన భూములు కట్టబెడుతున్నారని, మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ పేరుతో భూముల దోపిడీ జరుగుతోందన్నారు. సిరిసిల్ల, కొంగరకలాన్ ప్రాంతాల్లోనూ భూములను నిషేధిత జాబితాలో పెట్టారని పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తామని, ప్రజల భూములను కాపాడేందుకు పోరాడతామని కేటీఆర్ తెలిపారు.

కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారు: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. శాసనసభలో ముఖ్యమంత్రి వ్యవహారాలు బయటపడతాయనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 16 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం కోటి 16 లక్షల ఎకరాలను ఆ జాబితాలో చేర్చిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, అనుచరులకు విలువైన భూములు కట్టబెడుతున్నారని, మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ పేరుతో భూముల దోపిడీ జరుగుతోందన్నారు. సిరిసిల్ల, కొంగరకలాన్ ప్రాంతాల్లోనూ భూములను నిషేధిత జాబితాలో పెట్టారని పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తామని, ప్రజల భూములను కాపాడేందుకు పోరాడతామని కేటీఆర్ తెలిపారు.

