నేల కొండ పల్లి / ఖమ్మం
వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నేలకొండపల్లిలో బీజేపీ నేతలు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాలేరు నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి నున్నా రవికుమార్, మండల అధ్యక్షుడు పగర్తి సుధాకర్, గ్రామ సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, ఉపసర్పంచ్ మహేష్, బ్రాహ్మణ సంఘం జాతీయ నాయకులు ఇంగువ రామకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కోటి హనుమంతరావు, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మీగడ గోపి, మాజీ మండల అధ్యక్షుడు మన్నె కృష్ణారావు పాల్గొన్నారు. మండల ప్రధాన కార్యదర్శులు బాజా రామకృష్ణ, మల్లెబోయిన గోవిందరావు, ఉపాధ్యక్షులు పురాణం దివాకర్, కొండ హర్ష, నాయకులు ఎలిగేటి గిరి, ఎలిగేటి వెంకట్, కాలింగ్ వెంకటేశ్వర్లు, సూరేపల్లి జ్ఞాన రత్నం, భానోత్ వీరు నాయక్, మహిళా మోర్చా అధ్యక్షురాలు కందరబోయిన వెంకటరమణమ్మ తదితరులు పాల్గొన్నారు.



