సంగం: టీడీపీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిజం గెలిచింది” కార్యక్రమంలో భాగంగా సంగం మండలంలో టీడీపీ శ్రేణులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.టీడీపీ సంగం మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో సంగం బస్స్టాండ్ సెంటర్లో 53 దీపాలు వెలిగించి, చంద్రబాబు నాయుడు జైలులో గడిపిన 53 రోజుల నిర్బంధ కాలాన్ని గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.నిజం గెలిచింది.. న్యాయం నిలిచింది” అంటూ నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

53 రోజుల నిర్బంధాన్ని గుర్తు చేసుకుంటూ 53 దీపాలు వెలిగించిన టీడీపీ శ్రేణులు
సంగం: టీడీపీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిజం గెలిచింది” కార్యక్రమంలో భాగంగా సంగం మండలంలో టీడీపీ శ్రేణులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.టీడీపీ సంగం మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో సంగం బస్స్టాండ్ సెంటర్లో 53 దీపాలు వెలిగించి, చంద్రబాబు నాయుడు జైలులో గడిపిన 53 రోజుల నిర్బంధ కాలాన్ని గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.నిజం గెలిచింది.. న్యాయం నిలిచింది” అంటూ నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

