నందలూరు మండలంలో బజాజ్ నూతన మోడల్ బైక్ల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి యల్లటూరు శ్రీనివాసరాజు హాజరయ్యారు. షోరూమ్ యజమాని జిలానీ భాషా, ఆయన కుమారుడు తాజుద్దీన్ ఆహ్వానం మేరకు ఆయన షోరూమ్ను సందర్శించారు.
ఈ సందర్భంగా నూతన మోడల్ బైక్లను పరిశీలించిన యల్లటూరు శ్రీనివాసరాజు, షోరూమ్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. స్థానికంగా వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకు నాణ్యమైన వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్న షోరూమ్ యజమానులను ప్రోత్సహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. నూతన మోడళ్లతో వినియోగదారులకు మరిన్ని ఎంపికలు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఆర్టీసీ రీజినల్ చైర్మన్ యద్దల సుబ్బారాయుడు, జనసేన నాయకులు, మాజీ జెడ్పీటీసీ యల్లటూరు శివరామరాజు, మాజీ ఎంపీపీ పల్లె సుబ్రహ్మణ్యం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యద్దల విజయసాగర్, రిటైర్డ్ రైల్వే మెడికల్ ఆఫీసర్ జయభాస్కర్రావు, మాజీ ఎంపీటీసీ మాడపూరి శ్రీరాములు, టీడీపీ మండల అధ్యక్షుడు జంగంశెట్టి సుబ్బయ్య, వినోద్ వర్మ, నాగేశ్వరరావు, సెమీవుల్లా ఖాన్, తిప్పాయపల్లి ప్రశాంత్, జిల్ఫికర్, రెడ్డయ్య, సుబ్బ నరసయ్య, వెంకట నరసయ్య, శ్రీను, భాషా, ఎస్.వి. రాజు తదితరులు పాల్గొన్నారు.




