మహానంది:నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరీ దేవీ సమేత మహానందీశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము (IAS) దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. అనంతరం వేదపండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు. ఆలయ ప్రాశస్త్యాన్ని, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులు ఆయనకు వివరించారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

మహానందీశ్వరుని సేవలో రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము (IAS)
మహానంది:నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరీ దేవీ సమేత మహానందీశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము (IAS) దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. అనంతరం వేదపండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు. ఆలయ ప్రాశస్త్యాన్ని, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులు ఆయనకు వివరించారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

