చెన్నై నుంచి సూళ్లూరుపేట వరకు నడుస్తున్న మెమో ప్యాసింజర్ రైలును నాయుడుపేట వరకు పొడిగించాలని కోరుతూ బిజెపి నాయకులు విజయ్ కుమార్, చెంచుకృష్ణయ్య లు మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్ వెంకయ్యనాయుడుకు వినతిపత్రం సమర్పించారు. నెల్లూరులోని స్వర్ణభారతి ట్రస్ట్లో బుధవారం ఆయనను కలిసి స్థానిక రైల్వే సమస్యలపై చర్చించారు. చెన్నై నుండి సూళ్లూరుపేట వరకు నడుస్తున్న రైలును నాయుడుపేట వరకు పొడిగించడం వల్ల ఈ ప్రాంత ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన వెంకయ్యనాయుడు,ఈ విషయమై కేంద్ర రైల్వే శాఖ మంత్రితో స్వయంగా మాట్లాడి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.

*నాయుడుపేటకు మెమో రైలును పొడిగించాలి*
చెన్నై నుంచి సూళ్లూరుపేట వరకు నడుస్తున్న మెమో ప్యాసింజర్ రైలును నాయుడుపేట వరకు పొడిగించాలని కోరుతూ బిజెపి నాయకులు విజయ్ కుమార్, చెంచుకృష్ణయ్య లు మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్ వెంకయ్యనాయుడుకు వినతిపత్రం సమర్పించారు. నెల్లూరులోని స్వర్ణభారతి ట్రస్ట్లో బుధవారం ఆయనను కలిసి స్థానిక రైల్వే సమస్యలపై చర్చించారు. చెన్నై నుండి సూళ్లూరుపేట వరకు నడుస్తున్న రైలును నాయుడుపేట వరకు పొడిగించడం వల్ల ఈ ప్రాంత ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన వెంకయ్యనాయుడు,ఈ విషయమై కేంద్ర రైల్వే శాఖ మంత్రితో స్వయంగా మాట్లాడి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.

