ఖమ్మం:
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఆలపించకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ తీరును నిరసిస్తూ ఖమ్మం 3 టౌన్ గాంధీచౌక్లో బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం జిల్లా బీజేవైఎం అధ్యక్షులు శాసనాల సాయిరాం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జాతీయ గేయాన్ని అవమానించడం అంటే దేశ ప్రజల మనోభావాలను అవమానించడమేనని అన్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు నకరికంటి వీరభద్రం, జిల్లా కోశాధికారి కొనతం లక్ష్మీనారాయణ గుప్తా, ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పమ్మి అనిత, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటమర్తి సుదర్శన్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మంద సరస్వతి, ధార్మిక సెల్ జిల్లా అధ్యక్షులు మార్తి వీరభద్ర ప్రసాద్, సీనియర్ నాయకులు డోకుపర్తి రవీందర్
ధనియాకుల వెంకట నారాయణ యాదవ్, గుత్తా వంశీ, పిట్టల వెంకట నరసయ్య, కొంకిమల్ల మృత్యుంజయ రావు, దొన్వాన్ దాసు, అంకతి పాపారావు, జంగిలి రమణ, కొమ్మ మధు యాదవ్, ఢీకొండ శ్యాంసుందర్, గోనెల శివప్రసాద్, బట్టు రాహుల్ నాయక్, నూనె శ్రీను, బానోత్ పృథ్వీ, పాలెపు రాము, వల్లాల రమేష్, ఎలిసెట్టి మణికంఠ, ఆకుల నరేష్ గుప్తా, గోలి ఫణి కుమారి, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.



