దుత్తలూరు మండలంలోని విశ్వతేజ విద్యాసంస్థలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నేత మేకపాటి అభినవ్ రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మేకపాటి అభినవ్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.



