తిరుపతి ఆగస్టు 15 పున్నమి ప్రతినిధి
* భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి.
* ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి కలిసి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.
* అనంతరం జాతీయ గీతాలాపనతో జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.
* దేశ స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఎందరో మహానుభావుల త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ అని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
* ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యకుడు, యాదవ్ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, పార్లమెంట్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ రెడ్డి, కమిటీ సభ్యులు,కూటమి నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.




