Wednesday, 12 August 2026
  • Home  
  • శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ‘తల్లికి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనం లాంఛనంగా ప్రారంభం
- తిరుపతి

శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ‘తల్లికి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనం లాంఛనంగా ప్రారంభం

శ్రీ కాళహస్తి, ఆగస్టు 11, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల నందు కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ‘తల్లికి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ ప్రత్యేక వాహనాన్ని మంగళవారం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు జీ. విజయకుమార్ నాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మరియు గిరిజన సలహా మండలి సభ్యులు మాసారపు సుబ్బయ్య, కూటమి ముఖ్య నాయకులు ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బందితో కలిసి ఈ వాహనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, ఆసుపత్రి వైద్య సిబ్బంది మాట్లాడుతూ.. ప్రసవం అనంతరం బాలింతలను, నవజాత శిశువులను అత్యంత సురక్షితంగా, పైసా ఖర్చు లేకుండా ఉచితంగా వారి స్వగ్రామాలకు చేర్చడానికి ఈ ‘తల్లికి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలు ఎంతో దోహదపడతాయని వెల్లడించారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యం, సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, నియోజకవర్గంలో పేదలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా లభించే ఈ అద్భుత రవాణా సేవలను, అలాగే ఇతర అధునాతన వైద్య వసతులను పేద ప్రజలందరూ విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ఈ ప్రాధాన్యత కలిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ కాళహస్తి, ఆగస్టు 11, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల నందు కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ‘తల్లికి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ ప్రత్యేక వాహనాన్ని మంగళవారం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు జీ. విజయకుమార్ నాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మరియు గిరిజన సలహా మండలి సభ్యులు మాసారపు సుబ్బయ్య, కూటమి ముఖ్య నాయకులు ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బందితో కలిసి ఈ వాహనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, ఆసుపత్రి వైద్య సిబ్బంది మాట్లాడుతూ.. ప్రసవం అనంతరం బాలింతలను, నవజాత శిశువులను అత్యంత సురక్షితంగా, పైసా ఖర్చు లేకుండా ఉచితంగా వారి స్వగ్రామాలకు చేర్చడానికి ఈ ‘తల్లికి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలు ఎంతో దోహదపడతాయని వెల్లడించారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యం, సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, నియోజకవర్గంలో పేదలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా లభించే ఈ అద్భుత రవాణా సేవలను, అలాగే ఇతర అధునాతన వైద్య వసతులను పేద ప్రజలందరూ విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ఈ ప్రాధాన్యత కలిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.