రౌతులపూడి ( పున్నమి న్యూస్ ప్రతినిధి)ఆగష్టు 10:
మండలంలోని రౌతులపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా ఆదేశాల మేరకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కానుక పంపిణీ కార్యక్రమను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోళ్ల రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ షేక్ సలీమ్, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ పైల సాంబశివరావు హాజరయ్యారు. వాళ్ల చేతులు మీదుగా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పైల సాంబశివరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రార్ధనకి ఇస్తుందని విద్యార్థులు చదువుకో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ విద్యా మిత్ర కిట్టు ద్వారా అనేక వస్తువులు ఇస్తున్నారని సాంబశివరావు అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


