ఎస్ పైడిపాలలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం
రౌతులపూడి(మనసులో మాట) ఆగష్టు 09:
మండలంలోని ఎస్ పైడిపాల గ్రామంలో ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకుడు పోలోజు వరహాలు ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు బిర్సా ముండా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వరహాలు మాట్లాడుతూ ఆదివాసి హక్కు లు కోసం ప్రాణాలర్పించిన బిర్సా ముండా లాంటి మహానీయుల చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ మన హక్కులు కాపాడుకోవాలని ఆదివాసి లు విద్యావంతులుగా ఎదగాలని పోలో జ్వరహాలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘ నాయకులు పాల్గొన్నారు.


