తిరుమల ఆగస్టు 08 పున్నమి ప్రతినిధి
తిరుమలలో శనివారం రోహిణి నక్షత్రం సందర్భంగా శ్రీ రాధాకృష్ణులు భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా వైభవ మండపం నుంచి బయలుదేరి ఊంజల సేవ మండపానికి చేరుకున్నారు. అనంతరం సహస్రదీపాలంకరణ సేవలో పాల్గొన్న ఉభయ దేవేరులతో కూడిన శ్రీ రాధాకృష్ణులు అనంతరం నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

