Friday, 7 August 2026
  • Home  
  • NGKL: ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: USPC డిమాండ్
- నాగర్‌కర్నూల్

NGKL: ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: USPC డిమాండ్

నాగర్ కర్నూలు జిల్లా: ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని USPC డిమాండ్ చేసింది. ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు జిల్లాలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. TSUTF, DTF, TPTF ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఉపాధ్యాయులకు వెంటనే రెండో వేతన సవరణ సంఘం (2వ PRC) ప్రకటించాలని, బకాయి ఉన్న ఆరు డీఏలను (DAలు) తక్షణమే విడుదల చేయాలని సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. అలాగే CPSను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS)ను పునరుద్ధరించాలని, 2003 DSC ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశాయి. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, జీవో నెం.25ను సవరించాలని సంఘాల నాయకులు కోరారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని, 40 మంది విద్యార్థులు దాటిన తరగతులకు అదనంగా ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని విజ్ఞప్తి చేశారు.ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సంఘాల నాయకులు హెచ్చరించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఆగస్టు 12, 13 తేదీల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. ఆగస్టు 19న కలెక్టరేట్ ఎదుట జిల్లా స్థాయి ధర్నా, ఆగస్టు 29న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న ఈ ఉద్యమంలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని USPC, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

నాగర్ కర్నూలు జిల్లా: ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని USPC డిమాండ్ చేసింది. ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు జిల్లాలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. TSUTF, DTF, TPTF ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఉపాధ్యాయులకు వెంటనే రెండో వేతన సవరణ సంఘం (2వ PRC) ప్రకటించాలని, బకాయి ఉన్న ఆరు డీఏలను (DAలు) తక్షణమే విడుదల చేయాలని సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. అలాగే CPSను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS)ను పునరుద్ధరించాలని, 2003 DSC ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశాయి.
ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, జీవో నెం.25ను సవరించాలని సంఘాల నాయకులు కోరారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని, 40 మంది విద్యార్థులు దాటిన తరగతులకు అదనంగా ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని విజ్ఞప్తి చేశారు.ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సంఘాల నాయకులు హెచ్చరించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఆగస్టు 12, 13 తేదీల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. ఆగస్టు 19న కలెక్టరేట్ ఎదుట జిల్లా స్థాయి ధర్నా, ఆగస్టు 29న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉపాధ్యాయుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న ఈ ఉద్యమంలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని USPC, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.