ఖమ్మం ఆగష్టు 7
(పున్నమి ప్రతి నిధి)
ఖమ్మం: రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమానికి కాంగ్రెస్తో పాటు పలు ప్రజా, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ యువనేత తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ రైతులు, కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ఈ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.



