రామచంద్రాపురం ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాజధాని అమరావతి లోని ఉండవల్లి ఆయన నివాసంలో రాష్ట్ర ఎంఎస్ఎమ్ఎస్ఈ డైరెక్టర్ చినబాబు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి పారిశ్రామిక ప్రోత్సాహాలను ఉపాధి అవకాశాలపై చర్చించారు దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తగా తయారు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై ఆరా తీసారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు

