ఖమ్మం, ఆగస్టు 3
(పున్నమి న్యూస్)
ఖమ్మం జిల్లాలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నిరుద్యోగ యువకుడు గడ్డం వేణుకుమార్ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెమరుగోమ్ములగౌతమ్ రావు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే సోమవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా వేణుకుమార్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న నేతలు, ఆయనకు ధైర్యం చెప్పారు. నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా యువ మోర్చా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, యువత హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని భరోసా కల్పించారు.
నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, ఉద్యోగ నియామక ప్రక్రియలను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. వేణుకుమార్ త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. వీరి వెంట
బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, యువమోర్చ జిల్లా అధ్యక్షులు శాసనలా సాయి రామ్ లు ఉన్నారు



