అనపర్తి, ఆగస్టు 3 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలోని శ్రీ పార్వతి సమేత కూటేశ్వర స్వామి ఆలయాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులతో ఎమ్మెల్యే మమేకమయ్యారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో నిర్వహిస్తున్న అన్నసమారాధన కార్యక్రమం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో కుతుకులూరు గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.


