ఖమ్మం, ఆగష్టు
పున్నమి న్యూస్:
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుద్యోగి వేణుగోపాల్ ఆత్మహత్య యత్నం ఘటన అత్యంత విషాదకరమని మాజీ బీజేపీ యువమోర్చా (BJYM) జిల్లా అధ్యక్షుడు, ముదిగొండ మండలబిజెపి ఇంచార్జి అనంతు ఉపేందర్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో యువత తీవ్ర నిరాశకు గురవుతోందని ఆరోపించారు.
వేణుగోపాల్ ఆత్మ హత్య యత్నం ఘటన రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై ప్రభుత్వం బాధ్యత వహించాలని, భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ఘటనపై వెంటనే స్పందించి, వేణుగోపాల్ ని మరియు అయన కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు వారికి అన్ని విధాలా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, నిరుద్యోగులకు హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించి యువతకు భరోసా కల్పించాలని అన్నారు



